పెళ్లి పేరుతో మోసం
● పోలీస్స్టేషన్ ఎదుట కుటుంబ సభ్యులతో కలసి యువతి ధర్నా
ఆత్మకూరురూరల్: తనను పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసి నమ్మించి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని ఒక యువతి తన కుటుంబ సభ్యులతో కలసి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు .. ఏబీఎం పాలేనికి చెందిన యువతిని స్వరాజ్ నగర్కు చెందిన యువకుడు దారా రాజ్ కుమార్ ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటాని వాగ్దానం చేయడంతో కుటుంబ సభ్యులతో యువతి తల్లిదండ్రులు మాట్లాడారు. వారు వివాహానికి నిరాకరించడంతో తమకు న్యాయం చేయాలని బుధవారం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్పారు. రెండు కుటుంబాల వారు చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని తెలిపారు.


