శ్రీశైలంలో వేదశ్రవణం | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో వేదశ్రవణం

Jan 18 2026 6:55 AM | Updated on Jan 18 2026 6:55 AM

శ్రీశైలంలో వేదశ్రవణం

శ్రీశైలంలో వేదశ్రవణం

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామిఅమ్మవార్లకు ఆయా సేవలన్నీ పరిపూర్ణంగా జరిపించాలనే భావనతో వేదశ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఆలయ ప్రాంగణంలోని అమ్మ వారి ఆలయం వద్ద ఉన్న ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ జరిపారు. అలాగే రుత్విగ్వరణ కార్యక్రమంలో వేదపండితులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదపఠన కార్యక్రమం జరిపించారు. మూడు గంటల పాటు నిరంతరాయంగా వేదపారాయణాలు కొనసాగాయి. దేవస్థాన వేదపండితులతో పాటు కాణిపాకం, శ్రీకాళహస్తి, అన్నవరం, ద్వారక తిరుమల, ఇంద్రకీలాద్రి (విజయవాడ) దేవస్థానాల నుంచి వచ్చిన వేదపండితులతో పాటు తిరుపతి, హైదరాబాద్‌ నుంచి వచ్చిన పలువురు వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొని వేదపారాయణం చేశారు. దేవస్థానం వేదపండితులతో పాటు కార్యక్రమానికి హాజరైన వేదపండితులందరు కూడా స్వామిఅమ్మవార్ల కై ంకర్యంగా రెండు గంటల పాటు ఘనస్వస్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

డోన్‌ టౌన్‌: వెంకటాపురం చెరువు పెద్ద వంక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. కృష్ణగిరి మండలం పెనుమాడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ కౌలుట్ల శనివారం ఉదయం డోన్‌ నుంచి ఖాళీ బాక్స్‌ లోడ్‌తో స్వగ్రామానికి బయలుదేరాడు. అదే సమయంలో గుమ్మకొండ గ్రామానికి చెందిన సుధాకర్‌ బైకుపై డోన్‌కు వస్తుండగా ప్రమాదవశాత్తూ ఆటో, బైక్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధాకర్‌కు తీవ్ర, కౌలుట్లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సుధాకర్‌ను కర్నూలుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని పట్టణ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement