చిట్యాల: మండలంలోని వనిపాకల గ్రామానికి చెందిన మహిళ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చిట్యాల ఎస్ఐ ఇరుగు రవి తెలిపిన వివరాల ప్రకారం.. వనిపాకల గ్రామానికి చెందిన వెలిజాల రమణ(50) భర్త భాస్కర్ పదిహేనేళ్ల క్రితమే మృతి చెందడంతో ఆమె ఒంటరిగానే ఉంటుంది. ఆమెకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె వివాహం అయ్యింది. కుమారుడు హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో ఉంటూ అప్పుడప్పుడు తల్లిని చూసేందుకు వస్తూ ఉంటాడు. కాగా సోమవారం మధ్యాహ్నం అయినా రమణ ఇంట్లో నుంచి బయటకు రాకపోవటంతో స్థానికులు వెళ్లి తలుపులు తీసి చూడగా మంచంపై ఆమె విగతజీవిగా పడి ఉంది. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నార్కట్పల్లి సీఐ మహేష్ గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు భార్గవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment