ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. మంగళవారం ఎగువ 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 65.849 మి.యూ., దిగువ 5 యూనిట్ల నుంచి 200 మెగావాట్లు, 50.600 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 116.449 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగిందన్నారు. ప్రస్తుతం 40 వేల క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు.


