కందనూలు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిందని, ఎన్ని కుట్రలు చేసినా ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కూడలిలో కాంగ్రెస్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్ వెళ్లి అక్కడే కొద్దిసేపు బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈసందర్భంగా నాగం మాట్లాడుతూ.. ప్రశ్నించే గొంతుకలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు సంస్థలతో వేధింపులకు పాల్పడుతున్నాయని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ వచ్చిన ప్రజాదరణను చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని విమర్శించారు. రాహుల్ గాంధీకి సమస్త ప్రజానికం అండగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి, పీసీసీ సభ్యులు బాలగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, పాండు, కోటయ్య లక్ష్మయ్య, వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం
Published Sun, Mar 26 2023 1:40 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement