భక్తులకు తాగునీటి వసతి
ఏటూరునాగారం/ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు తాగునీటిని అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో వసతులు కల్పించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు క్యూలైన్లో కూడా తాగునీటి వసతి కల్పించారు. ఈసారి 5,500ల నల్లాలు, 517 బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్, 47 మినీ వాటర్ ట్యాంక్లు, 312 సిస్టర్స్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల కోసం తాత్కాలికంగా 5,700 మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 285 బ్లాక్లను ఏర్పాటు చేసి వాటి శుభ్రతకు 255 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. జాతరలో పారిశుద్ధ్య పనుల కోసం 5వేల శానిటేషన్ సిబ్బంది నియమించామన్నారు.


