పదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, ఈ విద్యాసంవత్సరంలో టెన్త్లో మెరుగైన ఫలితాలు సాధించాలని మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం పీఆర్టీయూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు హట్కార్ సమ్మయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పల్లె నాగరాజు, ఉప్ప స్వామి, ఉపాధ్యాయులు దీలిఫ్, సారంగపాణి, సతీ్ష్, వైనాల స్వామి, రవీందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


