16 నుంచి 20 కిలో మీటర్లు రాకపోకలు
మంగపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు రాజుపేట, రమణక్కపేట, చుంచుపల్లి, మల్లూరు, నర్సింహాసాగర్, తిమ్మంపేట గ్రామాలకు చెందిన విద్యార్థులు 16 నుంచి 20 కిలోమీటర్లు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నారు. బస్టాప్ లేదనే సాకుతో పలు గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు ఆపని పరిస్థితి ఉంది. నర్సింహాసాగర్కు బస్ సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు నిత్యం రూ.60 నుంచి రూ.100 వరకు ఆటో చార్జీలు చెల్లించి వచ్చి వెళ్తున్నారు. అంతే కాకుండా విద్యార్థినులు ఉచిత బస్సు సౌకర్యానికి సైతం దూరమవుతున్నారు. కళాశాల నుంచి ఇంటికి చేరుకోవడానికి గంటల తరబడి బస్సులు, ఆటోల కోసం వేచి చూడాల్సి వస్తుంది.


