స్వయం ఉపాధి ఊసేది? | - | Sakshi
Sakshi News home page

స్వయం ఉపాధి ఊసేది?

Dec 26 2025 8:15 AM | Updated on Dec 26 2025 8:15 AM

స్వయం

స్వయం ఉపాధి ఊసేది?

స్వయం ఉపాధి ఊసేది?

నిరాశలో రాజీవ్‌ యువ వికాసం పథకం దరఖాస్తుదారులు

రాజీవ్‌ యువవికాసం పథకం అమలు చేయాలి

నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి

యూనిట్ల వారీగా దరఖాస్తులు ఇలా..

ములుగు రూరల్‌: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకం ప్రవేశ పెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కాని అమలు చేయడంలో మాత్రం జాప్యం చేస్తుంది. జూన్‌ 2వ తేదీన పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో హడాహుడిగా నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో స్వీకరించారు. నేటికీ ఆరు నెలలు గడిచినా పథకం అమలు తీరుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ చెందుతున్నారు. నిరుద్యోగ యువత వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు అందించారు. జిల్లా స్థాయిలో ఎంపీడీఓలు లబ్ధిదారులకు బ్యాంకుల ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారులను ప్రకటించారు. ఇదే క్రమంలో రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో యువత నిరాశకు గురవుతుంది.

విడతల వారీగా కేటాయింపు

రాజీవ్‌ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని కేటగిరిలుగా విభజించి విడతల వారీగా యూనిట్లను అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేటగిరి 1లో రూ.50 వేలు, కేటగిరి 2లో రూ.లక్ష వరకు ఉన్న యూనిట్లను ఎంపిక చేసి మొదటి విడతలో అందించాలి. కేటగిరి 3లో రూ.2 లక్షలు, కేటగిరి 4లో రూ.4 లక్షలు, కేటగిరి 5లో రూ.5లక్షల కంటే పైబడిన యూనిట్లను అందించాల్సి ఉంది.

జిల్లాలో 3,005 మంది దరఖాస్తులు

బ్యాంకుల ఎంపిక, ఇంటర్వ్యూలు పూర్తి

ఆరు నెలలు గడిచినా

అమలు కాని పథకం

డిగ్రీ వరకు చదివి ఉద్యోగ అవకాశం లేక సెక్యూరిటి గార్డుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాను. స్వయం ఉపాధి పథకంలో పెళ్లి డెకరేషన్‌ సామగ్రికి రూ. 4 లక్షల యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూకు హాజరయ్యాను. బ్యాంక్‌ సిబిల్‌ స్కోర్‌ పరిశీలించి అర్హత గుర్తించారు. యూనిట్‌ మంజూరు అవుతుందని నెల రోజులుగా ఎదురు చూస్తున్నాను. తక్షణమే రాజీవ్‌ యువ వికాసం పథకం యూనిట్లు మంజూరు చేసి ఆదుకోవాలి.

– బల్లూరి ప్రభాకర్‌, మదనపల్లి

ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. బీసీ కార్పొరేషన్‌ నుంచి రాజీవ్‌ యువవికాసం పథకానికి దరఖాస్తు చేసుకున్నాను. వెల్డింగ్‌ దుకాణం ఏర్పాటుకు రూ. 4 లక్షల యూనిట్‌ ఎంపిక చేసుకున్నాను. ప్రభుత్వం సబ్సిడీ రుణం అందిస్తే స్వయం ఉపాధితో కుటుంబ పోషణకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాస పథకం మంజూరు పత్రాలను అందించాలి. – బైకాని మహేందర్‌,

శ్రీనగర్‌, మల్లంపల్లి మండలం

జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 3,005 మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 608 మంది, ఎస్టీ కార్పొరేషన్‌కు 1,200, మైనార్టీ కార్పొరేషన్‌కు 96, క్రిస్టియన్‌ మైనార్టీకి ఒకటి, బీసీ కార్పొరేషన్‌కు 817, ఈబీసీ వెల్ఫేర్‌ ద్వారా 67, వాషర్‌మ్యాన్‌ కార్పొరేషన్‌ సొసైటీకి 11, నాయీబ్రాహ్మణ కో ఆపరేటివ్‌ సొసైటీకి 3, వడ్డెర కో ఆపరేటివ్‌ సొసైటీకి ఒకటి, సగర కోఆపరేటివ్‌ సొసైటీకి ఒకటి, క్రిష్ణ బాలాజీ కోఆపరేటివ్‌ సొసైటీకి రెండు, కమ్మరి శాలివాహన కో ఆపరేటివ్‌ సొసైటీకి 7, విశ్వబ్రాహ్మణ కో ఆపరేటివ్‌ సొసైటీకి 24, మేదర కో ఆపరేటివ్‌ సొసైటీకి రెండు, టాడి సొసైటీకి 15, గంగపుత్ర కో ఆపరేటివ్‌ సొసైటీకి 40, పెరిక సొసైటీకి 32, ముదిరాజ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీకి 21, మున్నురుకాపు కో ఆపరేటివ్‌ సొసైటీకి 28, గొల్ల కురుమ కో ఆపరేటివ్‌ సొసైటీకి 29 దరఖాస్తులను నిరుద్యోగులు అందించారు.

స్వయం ఉపాధి ఊసేది?1
1/3

స్వయం ఉపాధి ఊసేది?

స్వయం ఉపాధి ఊసేది?2
2/3

స్వయం ఉపాధి ఊసేది?

స్వయం ఉపాధి ఊసేది?3
3/3

స్వయం ఉపాధి ఊసేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement