కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి

Apr 23 2025 8:17 AM | Updated on Apr 23 2025 8:55 AM

కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి

కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలి

ఏటూరునాగారం: దేశంలోని అన్ని రంగాల కార్మికుల కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని మే 20న చేపట్టిన దేశవ్యాప్త సమ్మెకు పెద్ద ఎత్తున తరలిరావాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి కార్మికులకు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ 29కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం ఏక పక్షంగా రద్దు చేసిందన్నారు. అనంతరం నాయకులు మల్లికార్జున్‌, దావూద్‌ మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చి కార్మికులను మోసం చేస్తుందన్నారు. దేశ వ్యాప్తం సమ్మెకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌, నాయకులు సద్దాం హుస్సేన్‌, మహేష్‌, పాప, రంజిత్‌, సడాలు, భిక్షపతి, సూరమ్మ, ఈశ్వరి, సుశాంత, నర్సమ్మ, రాంబాబు, రుక్మిణి, ఆదిలక్ష్మి, కాంత, కొమురయ్య, రాంబాబు పాల్గొన్నారు.

సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి మాధవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement