కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత మాటామంతి | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత మాటామంతి

Apr 22 2025 1:15 AM | Updated on Apr 22 2025 1:15 AM

కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత మాటామంతి

కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత మాటామంతి

గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో మాట్లాడారు. కవిత సోమవారం భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని తిరుగుప్రయాణంలో వస్తుండగా చల్వాయి గ్రామంలో 10నిమిషాల పాటు కాన్వాయి ఆపి కార్యకర్తలను పలకరించారు. ఈ క్రమంలో మహిళలు కవితకు మంగళ హారతితో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ క్రమంలో గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు లకావత్‌ నరసింహనాయక్‌, తుమ్మల హరిబాబు, భూరెడ్డి మధు, పూర్ణచందర్‌, బొల్లం ప్రసాద్‌, ఆలూరి శ్రీను, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement