
కార్యకర్తలతో ఎమ్మెల్సీ కవిత మాటామంతి
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి గ్రామంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపు బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడారు. కవిత సోమవారం భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకుని తిరుగుప్రయాణంలో వస్తుండగా చల్వాయి గ్రామంలో 10నిమిషాల పాటు కాన్వాయి ఆపి కార్యకర్తలను పలకరించారు. ఈ క్రమంలో మహిళలు కవితకు మంగళ హారతితో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ క్రమంలో గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు లకావత్ నరసింహనాయక్, తుమ్మల హరిబాబు, భూరెడ్డి మధు, పూర్ణచందర్, బొల్లం ప్రసాద్, ఆలూరి శ్రీను, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.