
నీటి తరలింపు పనులు వేగంగా పూర్తిచేయాలి
రామప్ప నుంచి నీటి తరలింపునకు ఐదేళ్ల క్రితమే టెండర్లు పిలిచారు. భూ సేకరణ స్థాయిలోనే కెనాల్ పనులు నిలిచిపోయాయి. మూడేళ్ల నుంచి చెరువు పూర్తిగా ఎండిపోతుంది. ఈసారి ఇప్పటికే 14అడుగులకు నీరు చేరింది. ఇంక మే నెలలో పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. లక్నవరం ఎండిపోతే రైతులకు, పర్యాటక రంగానికి చాలా ప్రమాదం. మంత్రి సీతక్క దృష్టి సారించి పనులు వేగవంతం చేసి త్వరగా రామప్ప నుంచి లక్నవరంలోకి నీటిని తీసుకొస్తే రైతులతో పాటు పర్యాటకులకు బాగుంటుంది.
– భేతి దేవేందర్రెడ్డి, బుస్సాపూర్, మాజీ సర్పంచ్
ఎంజాయ్ చేద్దామని వచ్చాము..
కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేద్దామని లక్నవరం సరస్సుకు వచ్చాము. కానీ, ఇక్కడికి వచ్చాక చెరువులో నీరు లేకపోవడంతో బాధగా ఉంది. బోటింగ్ చేయలేకపోయాం, అడ్వెంచర్ గేమ్స్ కూడా ఆడలేకపోయాం. లక్నవరం సరస్సు నిత్యం నీటితో నిండి ఉంటే బాగుంటుంది. అధికారులు తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. – గట్టు సుమన్, పర్యాటకుడు, వరంగల్

నీటి తరలింపు పనులు వేగంగా పూర్తిచేయాలి