
భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే
మంగపేట: జిల్లాలో పలు గ్రామాల్లో శుక్రవారం భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రేమ, దయాగుణం కలిగి ఉండాలని పలువురు పాస్టర్లు చర్చిల్లో సందేశమిచ్చారు. మంగపేట మండలం కమలాపురం, ఆయా గ్రామాల్లోని ఆర్ఎంసీ, సీఎస్ఐ, సియోను, అగాపే, అపోస్తలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఏసుప్రభు భక్తి గీతాలను ఆలపించారు. కమలాపురంలో రోమన్ కేథలిక్ చర్చి బృందం క్రీస్తు శిలువ యాత్రను నిర్వహించారు. కార్యక్రమంలో పాస్టర్లు ఆదాం, విజయరాజు, దేవరాజు, కృపానిధి భక్తులు పాల్గొన్నారు.
వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాకు కేటాయించిన వార్షిక ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని సింగరేణి డెరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ తెలిపారు. భూపాలపల్లి ఏరియాను శుక్రవారం సందర్శించి జీఎం కార్యాలయంలో ఏరియా జీఎం రాజేశ్వర్రెడ్డితో కలిసి అన్ని గనుల అధికారులతో ఉత్పత్తి ఉత్పాదకతలను గురించి చర్చించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. రక్షణ సూత్రాలను పాటిస్తూ ఉత్పత్తి లక్ష్యాన్ని తప్పక సాధించాలని ఆదేశించారు. రవాణాకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి బొగ్గు రవాణ లక్ష్యం కూడా తప్పక సాధించాలని అధికారులను కోరారు. ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించిన భూ సేకరణ, మట్టి వెలికితీయడంలో ఎదురయ్యే ఇబ్బందులు తక్షణమే పరిష్కరించుకొ ని ఉత్పత్తి సాధించాలని ఆదేశించారు. కార్మికులకు వైద్య సదుపాయం, ఇతర సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో ఓసీ–2 పీఓ వెంకటరామరెడ్డి, ఎస్వోటు జీఎం కవీంద్ర, ఓసీ–3 పీఓ భిక్షమయ్య పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే