TV Actor Rakshith Gowda Booked For Violating Night Curfew, Details Inside - Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి పార్టీ.. మద్యం మత్తులో చిందులు.. నటులపై కేసు

Jan 30 2022 6:38 AM | Updated on Jan 30 2022 9:35 AM

TV Actor Rakshith Gowda Booked for Violating Night Curfew - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు: నగరంలోని కెంగేరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ రిసార్టులో ఈ నెల 27వ తేదీ అర్ధరాత్రి నైట్‌ కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకుంటున్న టీవీ నటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీరియళ్లలో నటించే రక్షిత్‌–అనూషా దంపతులు, ఇతరులు అభిషేక్, రంజన్, రాకేశ్, రవిచంద్రన్‌లు అర్ధరాత్రి 1.30 సమయంలో మద్యం మత్తులో చిందులేస్తుండగా పోలీసులు వెళ్లి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.  

చదవండి: (భార్య మృతితో భర్త ఆత్మహత్య)  

Advertisement
 
Advertisement
Advertisement