
టాలీవుడ్ యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఆయనను కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్ వరించింది. ఈ ఏడాది ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికృష్ణకు యువ ప్రతిభ డైరెక్టర్ అవార్డ్ అందజేశారు. ప్రతి ఏటా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ నిర్వహిస్తున్నారు. తెలుగు సినీ రంగంలో తనదైన శైలిలో కథలతో సాయికృష్ణ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ అవార్డు, ఆయన కథ రచన, దిశానిర్దేశం, స్క్రీన్ప్లే రంగాల్లో చూపించిన సృజనాత్మకతకు గుర్తింపుగా దక్కించుకున్నారు. ఇటీవల ఆయన రూపొందించిన నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ సినిమాలకి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ద్వారా యువ దర్శకులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన కోడిరామకృష్ణ ఫిల్మ్ ఫౌండేషన్కు, తుమ్మలపల్లి రామసత్య నారాయణకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ – "ఇది కేవలం ఒక అవార్డ్ కాదు.. నా మీద ఉన్న నమ్మకానికి గుర్తింపు.. తెలుగు సినిమా కోసం ఇంకా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేయాలని ఉంది. నా టీమ్, నటీనటులు, టెక్నీషియన్లు, ప్రేక్షకులందరికీ ఇది అంకితం." అని తెలిపారు. కాగా.. ఈ కార్యక్రమానికి హీరో సుమన్, డైరెక్టర్ రేలంగి, నీహారిక కొణిదెల కూడా హాజరయ్యారు.