సంధ్య థియేటర్‌ ఘటన: విచారణకు వర్చువల్‌గా హాజరైన బన్నీ | Sandhya Theatre Stampede Case Update | Sakshi
Sakshi News home page

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు: కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్

Jul 6 2026 2:04 PM | Updated on Jul 6 2026 2:53 PM

Sandhya Theatre Stampede Case Update

సాక్షి, హైదరాబాద్‌: పుష్ప 2 రిలీజ్‌ సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసు విచారణ సోమవారం  నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ విచారణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముంబై నుంచి వర్చువల్‌గా హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన ముంబైలో షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల కోర్టు ఆయనకు వర్చువల్‌గా హాజరయ్యేందుకు అనుమతి నిచ్చింది. గత విచారణకు కూడా బన్నీ వర్చువల్‌గానే హాజరైన సంగతి తెలిసిందే.

ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. నిందితులందరూ కోర్టుకు హాజరైతేనే తదుపరి విచారణ కొనసాగుతుందని గతంలో న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేటి విచారణ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ (PP) కేసులోని 23 మంది నిందితులకు సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్ కాపీలను అందజేశారు.

అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. నిందితులకు ఛార్జ్ షీట్ కాపీలు అందడంతో, వచ్చే విచారణలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement