వారియర్‌గా 'రష్మిక మందన్నా'.. కొత్త సినిమా ప్రకటన | Rashmika Mandanna New Movie Mysaa Poster Out Now | Sakshi
Sakshi News home page

వారియర్‌గా 'రష్మిక మందన్నా'.. కొత్త సినిమా ప్రకటన

Jun 27 2025 2:00 PM | Updated on Jun 27 2025 3:48 PM

Rashmika Mandanna New Movie Mysaa Poster Out Now

2018లో "ఛలో" తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక మందన్న ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా సత్త చాటుతున్నారు. పుష్ప, యానిమల్‌, ఛావా సినిమాలతో పాటు రీసెంట్‌గా 'కుబేర'తో  బాక్సాఫీస్‌ వద్ద  మెప్పించారు.  కిల్లర్ లుక్స్‌తో ఇటు యూత్‌ ఐకాన్‌గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్‌ ఆప్షన్‌గా ఆమె మారిందని చెప్పవచ్చు. వరుస చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకున్నారు. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆమె మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. త్వరలో 'మైసా' అనే సినిమాతో వస్తున్నట్లు ఒక పోస్టర్‌తో ప్రకటించారు. 

అందులో రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్నారు. తాను గతంలో ఎప్పుడూ పోషించని పాత్రతో 'మైసా' కోసం చేస్తున్నట్లు రష్మిక చెప్పారు. అభిమానుల కోసం ఎప్పుడు కూడా కొత్తగా, భిన్నంగా ఉన్న పాత్రలే చేయాలనేది తన ఉద్దేశం అంటూ పేర్కొన్నారు. ఇది ఆరంభం మాత్రమే అంటూ మైసా పోస్టర్‌ను రష్మిక షేర్‌ చేశారు. ఇప్పటి వరకు రష్మికను శ్రీవల్లి, గీతాంజలిగా చూసిన ప్రేక్షకులు త్వరలో  ఒక వారియర్‌గా ఆమెను చూడనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. మరిన్ని విషయాలు త్వరలో  ప్రకటించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement