హీరో ప్రభాస్ థియేటర్కు వెళ్లారు. అయితే సినిమా చూసేందుకు కాదు. తన లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’ షూటింగ్ కోసం అన్నమాట. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘స్పిరిట్’. త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఇటీవల ప్రభాస్పై కాలేజీ, పోలీస్ స్టేషన్ వంటి సన్నివేశాలను చిత్రీకరించారు.
తాజాగా ఓ థియేటర్ నేపథ్యంలో వచ్చే సీన్స్ని హైదరాబాద్లోని ఓ థియేటర్లో చిత్రీకరించారు. ఈ మూవీలో ప్రభాస్ తొలిసారి పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి నిర్మిస్తున్న ‘స్పిరిట్’ సినిమా 2027 మార్చి 5న రిలీజ్ కానుంది.


