
సత్యం రాజేష్, శ్రవణ్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'పాడేరు 12వ మైలు'. ఎన్.కె దర్శకత్వం వహించారు. గ్రంధి త్రినాధ్ నిర్మాత. సుహాన హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 6న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం విశేషాలని పంచుకుంది.
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ మొదకొండమ్మ తల్లి ఆశీస్సులతో ఈ సినిమాను ముందుకు తీసుకొని వెళుతున్నాం. పొలిమేర , పొలిమేర 2 తరువాత సత్యం రాజేష్ నటించిన పాడేరు 12వ మైలు సినిమా సస్పెన్స, లవ్ ఎలిమెంట్స్ తో రాబోతోందని దర్శకుడు ఎన్.కె చెప్పుకొచ్చారు. హైదరాబాద్, వైజాగ్, పాడేరులో షూటింగ్ జరిగిన ఈ సినిమాకు పీఆర్ సంగీతం అందించారు. నభ మాస్టర్ ఫైట్స్, కళాదర్ నృత్యాలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి.