ఓటీటీకి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Malayalam Crime thriller Series based on true events to stream on This Ott | Sakshi
Sakshi News home page

Crime Thriller In Ott: ఓటీటీకి రియల్ క్రైమ్‌ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Aug 8 2025 5:01 PM | Updated on Aug 10 2025 12:54 PM

Malayalam Crime thriller Series based on true events to stream on This Ott

మలయాళ చిత్రాలకు ఓటీటీల్లో ఫుల్ డిమాండ్ఉంటోంది. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్స్కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ అయిన పలు మలయాళ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఓటీటీ ప్రియులనుఅలరించాయి. ఇలాంటి జోనర్లో ఎక్కువగా ఆడియన్స్కనెక్ట్ కావడంతో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సుదేవ్ నాయర్, జిన్స్, జియో బేబీ కీలక పాత్రల్లో సిరీస్ను రూపొందించారు.

కేరళ త్రిస్సూర్‌లోని అత్యంత వివాదాస్పద కేసు ఆధారంగా కమ్మటం అనే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ను తెరకెక్కించారు. వ్యక్తి అనుమానాస్పద రీతిలో రోడ్డు ప్రమాదంలో మరణించడం.. కేసు చుట్టు జరిగిన పరిణామాలే కమ్మటం వెబ్ సిరీస్. యదార్థ సంఘటనలతో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సిరీస్ను రూపొందించారు. సిరీస్లో మొత్తం ఆరు ఎపిసోడ్స్ఉండనున్నాయి.

క్రైమ్ ఇన్స్టిగేటివ్ వెబ్ సిరీస్ నెలలోనే ఓటీటీలో సందడి చేయనుంది. ఆగస్టు 29 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విషయాన్ని ప్రకటిస్తూ ప్రత్యేక పోస్టర్ను పంచుకున్నారు. సిరీస్లో అజయ్ వాసుదేవ్, అఖిల్ కవలయూర్, అరుణ్ సోల్, శ్రీరేఖ, జోర్డీ పొంజా కీలక పాత్రలు పోషించారు.

Advertisement
 
Advertisement
Advertisement