Sarkaru Vaari Paata: టార్గెట్ ఫిక్స్
మహేశ్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్కి తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 15న హైదరాబాద్లో ఆరంభం కానుందని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ను సెప్టెంబరు కల్లా పూర్తి చేయాలనే టార్గెట్ను కూడా ఫిక్స్ చేసుకున్నారట మహేశ్బాబు. ‘సర్కారువారి పాట’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు షెడ్యూలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, రాజమౌళి దర్శకత్వాల్లో హీరోగా సినిమాలు కమిటయ్యారు మహేశ్బాబు.