గుంటూరు కారం ఓటీటీ పార్ట్‌నర్‌ ఫిక్స్‌.. | Mahesh Babu Guntur Kaaram OTT Rights Bagged by This Platform | Sakshi
Sakshi News home page

Guntur Kaaram: గుంటూరు కారం ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే! సినిమా సత్తాను బట్టి..

Jan 12 2024 1:38 PM | Updated on Jan 12 2024 2:28 PM

Mahesh Babu Guntur Kaaram OTT Rights Bagged by This Platform - Sakshi

ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. దాదాపు రూ.40 కోట్లు పెట్టి మరీ గుంటూరు కారం సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చే

సంక్రాంతి రేసులోకి పందెం కోళ్లు దిగాయి. ఈరోజు (జనవరి 12న) మహేశ్‌బాబు గుంటూరు కారం, తేజ సజ్జా హనుమాన్‌ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒకటి మాస్‌ మసాలా సినిమా అయితే మరొకటి సూపర్‌ హీరో చిత్రం! ప్రస్తుతానికైతే ఈ రెండు సినిమాల మధ్య పోటీ గట్టిగానే ఉంది. ఇక ఈ సినిమాకు మొదట్లో రూ.150 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. కానీ సినిమా పూర్తయ్యేసరికి బడ్జెట్‌ అనుకున్నదానికంటే ఎక్కువే అయినట్లు తెలుస్తోంది.

ఓటీటీ రైట్స్‌..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేశ్‌, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. దాదాపు రూ.40 కోట్లు పెట్టి మరీ గుంటూరు కారం సినిమా ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. రెండు నెలల తర్వాతే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. బాక్సాఫీస్‌ దగ్గర సినిమా రిజల్ట్‌ను బట్టి సినిమా కాస్త ముందుగా లేదా ఆలస్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు కనిపిస్తోంది.

చదవండి: హను-మాన్‌ రిలీజ్‌.. ఆదిపురుష్‌ డైరెక్టర్‌పై మళ్లీ ట్రోలింగ్‌!
‘గుంటూరు కారం’ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement