Sudipto Sen: ఆస్పత్రిలో చేరిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!

The Kerala Story Director Sudipto Sen hospitalised due to exhaustion - Sakshi

ఆదాశర్మ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇటీవల మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సుదీప్తో సేన్ ఆస్పత్రిలో చేరారు. విరామం లేకుండా ప్రయాణాలు చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమాపై నిరసనలు వస్తున్నప్పటికీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. 

(ఇది చదవండి: బేబీ బంప్‌తో ఇలియానా సెల్ఫీ.. మొత్తానికి ఆ విషయం బయట పెట్టేసిందిగా!)

మే 5న విడుదలైన 'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద రూ. 200 కోట్ల మార్కును అధిగమించింది. అస్వస్థతకు గురైన ఆస్పత్రిలో చేరిన సుదీప్తో సేన్ కొన్ని ప్రచార కార్యక్రమాలకు విరామం ప్రకటించారు. ఈ చిత్రంలో అదా శర్మతో పాటు యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళకు చెందిన అమ్మాయిలు బలవంతంగా ఐసిస్‌లో చేరారన్నకథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. 

(ఇది చదవండి: సొంతింటి కల సాకారం చేసుకున్న రీతూ చౌదరి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top