దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్‌ ఆవేదన | Kareena Kapoor Khan Reacts On Media Telecast News | Sakshi
Sakshi News home page

దయచేసి ఇలాంటివి ఆపండి.. కరీనా కపూర్‌ ఆవేదన

Jan 21 2025 8:51 AM | Updated on Jan 21 2025 10:22 AM

Kareena Kapoor Khan Reacts On Media Telecast News

బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి  ఘటనలో ఆయన సతీమణి కరీనా కపూర్‌(Kareena Kapoor Khan) ఆవేదనతో ఒక పోస్ట్‌ చేశారు. ఈ ఘటనలో చాలామంది పూర్తి విషయాలు తెలుసుకోకుండానే అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ప్రధాన మీడియాతో పాటు సోషల్‌మీడియాలో క్రియేట్‌ చేసిన వీడియోను ఓ బాలీవుడ్‌ నటుడు షేర్‌ చేయడంతో కరీనా తాజాగా రియాక్ట్‌ అయ్యారు.

బాలీవుడ్ మీడియాలో సైఫ్‌ అలీఖాన్‌(Saif Ali Khan) గురించి చాలా కథనాలతో పాటు పలు వీడియోలు ప్రసారం చేస్తున్నారు. కొందరైతే ఏకంగా  సైఫ్  ఇంటి చుట్టూ నిత్యం కెమెరాలతో తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఆయన కుటుంబం గురించి ఉన్నవీలేనివి కల్పించి ప్రచారాలు చేస్తున్నారు. తన  కుమారులు తైమూర్, జెహ్ కోసం ఆయన కొత్త బొమ్మలు తెచ్చారని, చాలా సంతోషంగా  పిల్లలతో  సైఫ్ అలీఖాన్ ఆడుకుంటున్న ఫోటోలు ఇవిగో అంటూ షేర్ చేశారు.

  (ఇదీ చదవండి: త్రిష,టొవినో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా తెలుగులో విడుదల)

ఈ వార్తలు చూసిన కరీనా కపూర్‌ ఆవేదనతో ఒక పోస్ట్‌ చేసింది. 'దయచేసి ఇలాంటివి ఆపండి. మమ్మల్ని వదిలేయండి' అంటూ వేడుకుంది. అయితే, కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్‌ చేయడం గమనార్హం. ఇప్పటికే మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్‌లు సంయమనం పాటించాలని కరీనా కోరింది. తమ ప్రకటన లేకుండా ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని ఆమె కోరింది. ప్రస్తుతం తామె ఎంతో కఠినమైన రోజులను ఎదుర్కొంటున్నామని పరిస్థితిని అర్థం చేసుకుంటారని రిక్వెస్ట్‌ చేసింది. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా తమ కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని ఆమె కోరింది.

ఈ నెల 16న సైఫ్‌ ఇంటికి చోరీకి వెళ్లిన  షరీఫుల్‌ ఇస్లాం షెహ్‌జాద్‌ మొహమ్మద్‌ రోహిల్లా అమీన్‌ ఫరీగా పోలీసులు గుర్తించి అరెస్ట్‌ చేశారు.  బంగ్లాదేశ్‌కు చెందిన అతను తమ దేశానికి పారిపోయే ప్లాన్‌లో ఉండగా పోలీసులు పట్టుకున్నారు. దాడిలో గాయపడిన సైఫ్‌ స్వల్ప శస్త్రచికిత్స తర్వాత కోలుకుంటున్న విషయం తెల్సిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement