Ghantasala: నాన్న చివరి కోరిక నెరవేర్చబోయి అమ్మ ప్రాణాలు విడిచింది.. ఘంటసాల తనయుడు

Ghantasala Son Ravi Kumar About Sarala Death - Sakshi

అమరగాయకుడు ఘంటసాల స్వరం వినిపిస్తే చాలు.. పులకించిపోయే జనాలు చాలామంది ఉన్నారు. జానపదాల నుంచి జావళీల దాకా, భక్తి గీతాల నుంచి అష్టపదుల దాకా ఆయన ముద్ర కనిపిస్తుంది. ఆయనకు ఇద్దరు భార్యలన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. ఒకరు సావిత్రి అయితే మరొకరు సరళ. ఘంటసాల- సరళల సంతానమే రవి కుమార్‌.

తాజాగా రవి కుమార్‌ ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గరించి మాట్లాడారు. 'నాన్నకు మానస సరోవర యాత్ర వెళ్లాలని ఎప్పటినుంచో కోరిక. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. అయితే ఎలాగైనా ఆ యాత్ర పూర్తి చేయాలని అమ్మ భావించింది. ఒక బృందంతో కలిసి మానస సరోవర యాత్రకు వెళ్లింది. ఎంతో సంతోషంతో మాకు ఫోన్‌ చేసి తన యాత్ర విశేషాలు చెప్పింది. సరోవర యాత్ర పూర్తి చేసుకున్నాక అందరికీ బాయ్‌ చెప్పి టెంట్‌లోకి వెళ్లి నిద్రించింది. అక్కడే తుదిశ్వాస విడిచింది' అని చెప్పుకొచ్చారు.

చదవండి: బిగ్‌బాస్‌ 7లో రష్మీ, స్పందించిన యాంకర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top