
‘‘మంచి హారర్ మిస్టరీగా రూపొందిన చిత్రం ‘కిష్కిందపురి’. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అంద రికీ నచ్చుతుంది’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పారు. కౌశిక్ పెగల్లపాటి రచన, దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా నటించిన చిత్రం ‘కిష్కిందపురి’. అర్చన సమర్పణలో సాహు గారపాటి నిర్మించారు.
ఈ చిత్రం నుంచి ‘ఉండిపోవే నాతోనే...’ అంటూ సాగే తొలి పాటని రిలీజ్ చేశారు. చేతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాటకి పూర్ణాచారి సాహిత్యం అందించగా, జావేద్ అలీ పాడారు. రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. అనుపమ మాట్లాడుతూ– ‘‘నాకు చాలా ప్రత్యేకమైన సినిమా ఇది’’ అన్నారు. ‘‘నేను చదువుకున్న కాలేజీలో నా సినిమా పాటను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ ఈ పాటను, సినిమాని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కౌశిక్ పెగల్లపాటి. ‘‘చాలా మంచి కథ ఇది’’ అన్నారు చేతన్ భరద్వాజ్.