
యాక్టర్గా ధనుష్కు ఫుల్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కోలీవుడ్ క్రేజీ హీరో మిత్రన్ జవహర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కథరీత్యా ముగ్గురు హీరోయిన్లకు చాన్స్ ఉందట. ప్రస్తుతం కథానాయికలను ఎంపిక చేసే పనిలో మిత్రన్ ఉన్నారట. నిత్యామీనన్, హన్సిక, ప్రియాభవానీ శంకర్లను ఫైనలైజ్ చేశారని కోలీవుడ్ టాక్. మరి... ధనుష్ సరసన ఈ ముగ్గురూ ఫిక్సేనా? వేచి చూడాల్సిందే.