
'రాజాసాబ్' బ్యూటీ, హీరోయిన్ మాళవిక మోహనన్ మరో అవార్డ్ దక్కించుకుంది. ముంబైలో జరిగిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్లో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ దక్కించుకుంది. ఓటీటీ, వెబ్ ఎంటర్టైన్మెంట్కు సంబంధించిన బిగ్గెస్ట్ అవార్డ్స్గా ఈ సంస్థకు పేరుంది. ఈ ఈవెంట్లో రెడ్ కార్పెట్పై నడిచిన మాళవిక.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఫొటోల్ని తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.
(ఇదీ చదవండి: కలిసిరాని సినిమాలు.. తిరిగొచ్చేసిన ప్రదీప్)
మాళవిక మోహనన్ ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజా సాబ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన రాజాసాబ్ టీజర్లో మాళవిక స్టన్నింగ్ లుక్స్తో ఆకట్టుకుంది. డిసెంబరులో రిలీజయ్యే ఈ చిత్రంతో తెలుగు ఆడియెన్స్కు మరింత దగ్గర అవుతుందేమో చూడాలి.
కేరళకు చెందిన మాళవిక.. 2013లో తొలుత మలయాళ సినిమాలతోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత కన్నడ, హిందీలోనూ పలు చిత్రాలు చేసింది. రజినీకాంత్ 'పేట' మూవీ ఈమెకు కాస్త గుర్తింపు తీసుకొచ్చింది. దళపతి విజయ్ 'మాస్టర్'తో మరో హిట్ అందుకుంది. గతేడాది 'యుద్రా' అనే హిందీ సినిమా చేసింది. ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో ప్రస్తుతం ఆశలన్నీ 'రాజాసాబ్'పైనే పెట్టుకుంది. ఇది కాకుండా సర్దార్ 2, హృదయపూర్వం అనే చిత్రాల్లో నటిస్తోంది.
(ఇదీ చదవండి: 'కుబేర' రెండో రోజు కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు?)