రాఖీ పండుగ సందర్భంగా శుక్రవారం నర్సాపూర్ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడింది. రద్దీ నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ఇదే అదనుగా అదనపు చార్జీలు వసూలు చేసింది. నర్సాపూర్ నుంచి బాలానగర్ వరకు ఆర్డీనరీ బస్సుకు రూ. 80 చార్జీ ఉండగా, ప్రత్యేక సర్వీసులో అదనంగా రూ.30 వసూలు చేశారు. అలాగే నర్సాపూర్ నుంచి మెదక్కు ఆర్డీనరీ సర్వీసులో రూ. 70 చార్జీ ఉండగా, అదనంగా రూ. 30 తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్టాండ్లో కనీస వసతులు కల్పించలేదని ప్రయాణికులు వాపోయారు.
– నర్సాపూర్


