మంచిర్యాలటౌన్: ఈ నెల 10న తలపెట్టిన ‘చలో హైదరాబాద్’కు అనుమతి ఇవ్వాలని టీజీఈజేఏసీ నాయకులు మంగళవారం కలెక్టర్ కుమార్దీపక్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం అదనపు కలెక్టర్ చంద్రయ్యను కలిసి ఉద్యోగుల సమస్యల కోసం చేస్తున్న పోరాటానికి సంబంధించిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజారెడ్డి, జిల్లా కో చైర్మన్లు ఎస్.కిషన్, శ్రీనివాస్ దేశ్పాండే, దుర్గాప్రసాద్, పొన్న మల్లయ్య, రౌఫ్ఖాన్, సురేఖ, శ్రీపతి బాపురావు, అత్తె సుధాకర్, బొడ్డు శ్రావణ్ కుమార్, సునీత పాల్గొన్నారు.


