దండేపల్లి: ఎస్ఐఆర్ (సర్) సవరణలో భాగంగా మండలంలోని మేదరిపేట గ్రామపంచా యతీ కార్యాలయం వద్ద అధికారులు ఆదివా రం బీఎల్వోలను అందుబాటులో ఉంచారు. నోటీసుల జారీ చేయడంతోపాటు నోటీసులు అందుకున్నవారు అందించే ఆధార పత్రాలు స్వీకరించాలని ఆదేశించారు. కాగా, ఓటర్లు కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలో ఓ బీఎల్వో కాళ్లు పెట్టుకోవడం, ఓటరు నిలబడి ఉండగా.. ఈ దృశ్యాన్ని స్థానికులు ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. విష యం తెలుసుకున్న ఎంపీడీవో ప్రసాద్ అక్కడికి వచ్చి బీఎల్వోలను మందలించారు. ఓటర్లతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.


