మంచిర్యాలటౌన్: జిల్లాలో చేపట్టిన సర్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు అన్నారు. శనివా రం మంచిర్యాల, నస్పూర్ తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి, ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సాదాబైనామా, భూభారతి, రెవెన్యూ స దస్సుల్లో వచ్చిన దరఖాస్తులను రికార్డులను అనుసరించి పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.


