మంచిర్యాలఅగ్రికల్చర్: సీపీఎస్ రద్దు చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన జనజాగరణ యాత్ర పోస్టర్లను ఆ సంఘం నాయకులు గురువారం కలెక్టరేట్ ఆవరణలో ఆవిష్కరించారు. టీఎస్పీఎస్ఈయూ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల రాజేందర్ మాట్లాడుతూ జనజాగరణ యాత్ర ఈ నెల 25న మంచిర్యాల జిల్లాకు చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి శ్రావణ్కుమార్, మంచిర్యాల ఏరియా అధ్యక్షులు గోపాల్, ప్రధాన కార్యదర్శి అజయ్ ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షుడు రామ్కుమార్, తిరుపతి, రాజేందర్, మహిళా కార్యదర్శి సునీత పాల్గొన్నారు.


