కాసిపేట: ఎన్యూమరేషన్ ఫారాలు పూరించేందుకు ఓటర్లకు సహకరించాలని అదనపు కలెక్టర్ చంద్ర య్య సూచించారు. శనివారం మండలంలోని దేవా పూర్లో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీ లించారు. బీఎల్వోలకు పలు సూచనలు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, వార్డుసభ్యులు, ఎస్హెచ్జీ సభ్యులు, బీఎల్ఏలు, గ్రామ పెద్దలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. మా డల్ స్కూల్, కేజీబీవీని సందర్శించి ఉపాధ్యాయుల ఎఫ్ఆర్ఎస్ హాజరు వివరాలు, తరగతి గదులను పరిశీలించారు. కేజీబీవీలో చేపట్టిన డార్మెటరీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజ నం చేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్ సిడాం రాందాస్, తహసీల్దార్ సునీల్కుమార్ దేశ్పాండే, ఎంఈవో వెంకటేశ్వరస్వామి, పంచాయతీ కార్యదర్శి కవిత, వార్డు సభ్యులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.


