పర్యావరణానికి పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణానికి పాటుపడాలి

Apr 20 2024 1:25 AM | Updated on Apr 20 2024 1:25 AM

సైకిల్‌ ర్యాలీలో గని అధికారులు, కార్మికులు  - Sakshi

సైకిల్‌ ర్యాలీలో గని అధికారులు, కార్మికులు

బెల్లంపల్లి: పర్యావరణాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని మందమర్రి ఏరియా శాంతిఖని గ్రూప్‌ఆఫ్‌ మైన్స్‌ ఏజెంట్‌ ఆర్‌.విజయప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ప్రపంచ ప ర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప ర్యావరణ పరిరక్షణలో భాగంగా గని ఆవరణ లో షాప్ట్‌ నుంచి ఫ్యాన్‌ హౌజ్‌ వరకు సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కా ర్మికులు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటేనే భావితరాలకు భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా శక్తిని, నీటిని ఆదా చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రూప్‌ ఇంజినీర్‌ బసవరాజు, గ ని మేనేజర్‌ సంజయ్‌కుమార్‌సిన్హా, ఫిట్‌ ఇంజి నీర్‌ రాంబాబు, బీఎం ఇంచార్జీ ముస్తాఫా, వెంటిలేషన్‌ అధికారి పూర్ణచందర్‌, గని సంక్షేమ అధికారి సత్యనారాయణ, ఏఐటీయూసీ ఫిట్‌ సెక్రెటరీ దాసరి తిరుపతిగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement