బుల్లెట్టుబండిపై బహిరంగసభకు సంజయ్‌

ర్యాలీగా సభకు వెళ్తున్న బండి సంజయ్‌, వివేక్‌, నాయకులు - Sakshi

దండేపల్లి: లక్సెట్టిపేటలో బుధవారం జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మండలంలోని గూడెం వద్ద నాయకులు ఘనస్వాగతం పలికారు. కరీంనగర్‌ నుంచి వాహనంలో వచ్చిన సంజయ్‌ గూడెం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు గూడెం నుంచి లక్సెట్టిపేట వరకు నిర్వహించిన బైక్‌ర్యాలీలో సంజయ్‌ బుల్లెట్‌ బండి నడుపుకుంటూ సభవద్దకు చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌, మాజీ ఎంపీలు వివేక్‌, రాథోడ్‌ రమేష్‌, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య పాల్గొన్నారు.

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top