● ఊరుగొండలో ఘటన
దామెర: అప్పుల బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలో చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెట్టుపల్లి విజేందర్ (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఇంటి నిర్మాణానికి కొంత అప్పు చేశాడు. ఎలా తీర్చాలో తెలియక మద్యానికి బానిపై మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మంగళవారం వెల్లడించారు.


