న్యూస్రీల్
‘తొర్రూరు మండలం వెలికట్ట గ్రామానికి చెందిన కొమ్ము విష్ణు అనే యువకుడు 2024 సెప్టెంబర్ 7న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి కుడి కాలు తొలగించారు. పేద కుటుంబానికి చెందిన యువకుడు పింఛన్ కోసం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ నేటికీ అందలేదు. పింఛన్ మంజూరు అయితే అవసరాలు తీర్చుకుంటామని ఆయన కోరుతున్నాడు.’
‘జిల్లాలోని బయ్యారం మండలం ఇర్సులాపుం గ్రామానికి చెందిన కలికినేని సంపత్ తొమ్మిది నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాడు. డాక్టర్ 57శాతం అంగవైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చాడు. సంపత్ పింఛన్ మంజూరు కోసం ప్రయత్నిస్తున్నాడు. కాగా, ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేస్తేనే నీకు కూడా పింఛన్ వస్తుందని అధికారులు చెబుతున్నారని, అవి ఎప్పుడు వస్తాయో అని సంపత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.’


