● చేపల కొనుగోలుకు ప్రజల ఆసక్తి
● కేజీ రూ.250 నుంచి రూ.600 వరకు విక్రయాలు
నెహ్రూసెంటర్: మృగశిర కార్తె రోజు చేపలు తింటే మంచిదని, తప్పకుండా తినాలనే నానుడి ఉంది. కాగా, సోమవారం మానుకోట పట్టణంలో చేపల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపారు. సాధారణ రోజుల్లో వివిధ రకాల చేపలను కిలో రూ.180 నుంచి రూ.500 వరకు విక్రయించే వారు. అయితే మృగశిర కార్తె సందర్భంగా కిలో వివిధ రకాల చేపలను రూ.250 నుంచి రూ.600పైగా విక్రయించారు. ఎక్కువ ధరలు ఉన్నప్పటికీ ప్రజలు చేపలకోసం ఎగబడ్డారు.


