3,374 ఎకరాల్లో పంట నష్టం | - | Sakshi
Sakshi News home page

3,374 ఎకరాల్లో పంట నష్టం

Apr 24 2025 1:54 AM | Updated on Apr 24 2025 1:54 AM

3,374

3,374 ఎకరాల్లో పంట నష్టం

మహబూబాబాద్‌ రూరల్‌: జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, బొప్పాయి, వరి, మొక్కజొన్న పంటలు అధికంగా దెబ్బతిన్నాయి. అలాగే కల్లాల్లో ఆరబోసిన మిర్చి తడిసి ముద్దయింది. ఈమేరకు వ్యవసాయ, హార్టికల్చర్‌ అధికారులు పంటలను పరిశీలించడంతో పాటు రైతుల నుంచి నష్టపోయిన పంటల వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 3,374.30 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు నిర్ధారించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కాగా ప్రభుత్వం అందించే నష్టపరిహారం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

2,855 ఎకరాల్లో వరికి,

76.30 ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం..

ఈదురుగాలుల బీభత్సం, గాలివాన, వడగండ్ల కారణంగా జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలు మొత్తంగా 2,859 మంది రైతులకు సంబంధించి 2,931.30 ఎకరాల్లో నష్టంవాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు నిర్ధారించారు. ఇందులో 2,855 ఎకరాల్లో వరి పంట, 76.30 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలోని మండలాల పరిధిలో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు నష్టపోయిన రైతులతో మాట్లాడి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేశారు. జిల్లాలోని మహబూబాబాద్‌, నెల్లికుదురు, ఇనుగుర్తి, పెద్దవంగర, కేసముద్రం, కొత్తగూడ మండలాల పరిధిలో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు.

443 ఎకరాల్లో మామిడి,

బొప్పాయి తోటలకు నష్టం..

అకాల వర్షం వల్ల జిల్లాలో 443 ఎకరాల్లో మామిడి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారులు నిర్ధారించారు. జిల్లా వ్యాప్తంగా ఇద్దరు రైతులకు చెందిన ఐదు ఎకరాల బొప్పాయి తోటకు వర్షం కారణంగా తీవ్ర నష్టం చేకూరినట్లు తెలిపారు. 128 మంది రైతులకు చెందిన 438 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు.

‘ఈ ఫొటోలో కనిపిస్తున్నది కేసముద్రం మండలం క

ల్వల గ్రామానికి చెందిన రైతు పాల శ్రీనివాస్‌. నాలుగు ఎకరాల మేరకు వరి పంట సాగుచేశాడు. అకాల వర్షంతో పంట ఈనె దశలో మొత్తం నేలవాలిపోయింది. అదే విధంగా రెండు ఎకరాల మేరకు మొక్కజొన్న సాగుచేయగా వడిచుట్టుకుపోయింది. వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రూ.3లక్షల మేరకు నష్టంవాటిల్లిందని రైతు శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.’

అకాల వర్షంతో దెబ్బతిన్న వరి,

మొక్కజొన్న, మామిడి, బొప్పాయి

ప్రభుత్వానికి నివేదిక పంపిన

అధికారులు

3,374 ఎకరాల్లో పంట నష్టం1
1/1

3,374 ఎకరాల్లో పంట నష్టం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement