విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తోలేటీ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటలకు ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచి డయర్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని, వీటిని వెంటనే పరిష్కరించాలని ఆయా జిల్లాల ఎస్ఈలను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారులు డయల్ యువర్ కార్యక్రమానికే కాకుండా టోల్ఫ్రీ నెంబర్లు 1912 లేదా 1800425155333 నంబర్లకు ఫోన్ చేసి సమస్యలు చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాప్ ద్వారా కూడా సమస్యలను చాట్ చేయవచ్చని సూచించారు.


