30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం

Nov 17 2025 8:42 AM | Updated on Nov 17 2025 8:42 AM

30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం

30 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం

నందికొట్కూరు: వడ్డేమాన్‌ గ్రామంలో ఓ రైతు నిర్లక్ష్యం వల్ల 30 ఎకరాల మొక్కజొన్న పంట, 4 ఎకరాల్లో కంది పంట దగ్ధమైన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. బ్రాహ్మణకొట్కూరు ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోయ సోమన్న అతని రెండు ఎకరాల్లో మొక్కజొన్న కొయ్యలకు నిప్పు పెట్టారు. ఈ సమయంలో చుట్టూ ఉన్న కొందరు రైతులకు చెందిన మొక్కజొన్న పంట, కంది పంటకు మంటలు వ్యాపించి మొత్తం దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తెలుగు రోషన్నకు చెందిన 10 ఎకరాల మొక్కజొన్న, బ్రాహ్మణకొట్కూరుకు చెందిన అబ్దుల్‌ రహిమాన్‌–7 ఎకరాలు, ముర్తుజావలి–4, ఈశ్వరన్న–5, నూరుల్లా–4, నాగపుల్లన్నకు 4 ఎకరాల కంది పంట మొత్తం దగ్ధమైంది. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తిరుపాలు పొలాలను పరిశీలించారు. రైతుల ఫిర్యాదు మేరకు బోయ సోమన్నపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement