
47 నూతన మద్యం బార్లకు నోటిఫికేషన్
26వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
28న లాటరీ ద్వారా బార్ల కేటాయింపు
సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి కొత్త బార్లు
కలెక్టర్ అనుమతితో గజిట్ విడుదల చేసిన ఎకై ్సజ్ అధికారులు
కర్నూలు: మూడేళ్ల కాల పరిమితితో నూతన మద్యం బార్ పాలసీ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2028 ఆగస్టు 31వ తేదీ వరకు నూతన పాలసీ అమలులో ఉంటుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి 47 నూతన మద్యం బార్లకు కలెక్టర్ల అనుమతితో ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్ అధికారులు సుధీర్ బాబు, రవికుమార్ సోమవారం గజిట్ విడుదల చేశారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నూతన బార్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈనెల 28న కర్నూలుకు సంబంధించి జిల్లాపరిషత్ సమావేశ భవనం, నంద్యాలకు సంబంధించి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో లాటరీ పద్ధతిలో ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో బార్లను కేటాయించనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కొత్త బార్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కొక్క దరఖాస్తు విలువ రూ.5 లక్షలు నాన్ రీఫండబుల్ ఫీజు, రూ.10 వేలు ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. నూతన మద్యం బార్ల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఎకై ్సజ్ అధికారులు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఒకే స్లాబ్లో లైసెన్స్ దారుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేయనున్నారు. 55 లక్షల జనాభా లోపు ఉన్న ప్రాంతంలో రిటైల్ ఎకై ్సజ్ రుసుం రూ.35 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే గూడూరు నగర పంచాయతీలో మాత్రం 50 వేల లోపు జనాభా ఉన్నందున రూ.35 లక్షలు రిటైల్ ఎకై ్సజ్ రుసుం చెల్లించాలి.
● ఏ ప్రాంతం, ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా నూతన మద్యం బార్కు దరఖాస్తు చేసుకోవచ్చు.
● ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా కొనుగోలు చేయవచ్చు. ఎన్ని బార్లకై నా దరఖాస్తు చేసుకోవచ్చు.
● అందిన దరఖాస్తుల్లో ఒక్కొక్క బార్ను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. వీటితో పాటు గౌడ కులాలకు కర్నూలు కార్పొరేషన్ పరిధిలో 2, ఆదోని మున్సిపాలిటీలో 1, నంద్యాల మున్సిపాలిటీలో 1, డోన్ మున్సిపాలిటీ పరిధిలో 1 చొప్పున రిజర్వేషన్ ప్రాతిపదికన బార్లను కేటాయించనున్నారు.
● ఇందుకోసం గౌడ్, ఈడిగ కులాలకు సంబంధించిన వారు రిజర్వేషన్ ప్రాతిపదికన కేటాయించిన దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
పొడిగించిన వ్యాపార సమయాలు...
బార్లు ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు (14 గంటలు) అనుమతించబడతాయి. గతంలో 11 గంటల వరకే అనుమతి ఉండేది. అయితే ఒక గంట సమయాన్ని పెంచుతూ మందుబాబులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. లైసెన్స్ రుసుం ఆరు సమాన వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. ఇన్స్టాల్మెంట్కు సరిపడ బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలనే నిబంధన విధించారు. బార్లకు కూడా ఏ4 దుకాణాల మాదిరిగానే ఏపీఎస్డీసీఎల్ నుంచి మద్యం స్టాక్ కొనుగోలు చేసుకోవచ్చు. లైసెన్స్ పొందినవారు 15 రోజుల లోపు రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలు, కార్పొరేషన్ పరిధిలో 10 కిలోమీటర్లు నిడివిలో, మున్సిపల్ ఏరియాలో మూడు కిలోమీటర్ల దూరం ఉండేలా బార్లు ఏర్పాటు చేసుకోవాలి.
కర్నూలు జిల్లాలో బార్ల ఏర్పాటు ప్రాంతాలు...
కర్నూలు కార్పొరేషన్లో 16 జనరల్ కేటగిరీ 2 గీత కులాలకు, ఆదోని మున్సిపాలిటీలో 4 జనరల్ కేటగిరీ 1 గీత కార్మికులకు కేటాయించారు. ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 2, గూడూరు నగర పంచాయతీలో 1 బార్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది.
నంద్యాల జిల్లాలో....
నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో 14 జనరల్ కేటగిరీ 1 గీత కులాలకు, డోన్ మున్సిపాలిటీలో 1 జనరల్ కేటగిరీ మరొకటి గీత కులాలకు కేటాయించారు. నందికొట్కూరు, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బేతంచెర్లలో ఒక్కొక్కటి చొప్పున బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతించింది.