
పోలీసు శాఖలో 154 మందికి స్థానచలనం
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని వివిధ స్టేషన్లలో పనిచేస్తున్న 118 మంది కానిస్టేబుళ్లు, 24 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 12 మంది ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో శనివారం బదిలీల ప్రక్రియ నిర్వహించారు. ఒకే పోలీస్ స్టేషన్లో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిబ్బంది జాబితాను ముందుగానే సిద్ధం చేసి కౌన్సెలింగ్కు పిలిచారు. సీనియారిటీ జాబితాను ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించి స్టేషన్ల వారీగా ఖాళీలను అందులో చూపి బదిలీలకు కౌన్సెలింగ్ చేపట్టారు. ఖాళీలకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. స్పౌజ్ కేసు (భార్యాభర్తలు ఉద్యోగులు), అనారోగ్యంతో ఉన్న పోలీసు సిబ్బందికి మినహాయింపు ఇచ్చి కోరుకున్న చోటుకు బదిలీ చేశారు. కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా, డీపీఓ ఏఓ విజయ్కుమార్ నాయుడు, స్పెషల్ బ్రాంచ్ సీఐ తేజమూర్తి, ఎస్ఐలు ఖాజా వలి, వేణుగోపాల్ రాజు, డీపీఓ కా ర్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మైనారిటీలకు
సబ్సిడీ రుణాలు
● దరఖాస్తుకు మే 25 ఆఖరు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిిస్ట్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు మే 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిిస్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూరవుతుందన్నారు. అర్హత కలిగిన వ్యక్తులు వివరాలను https://apobmms.apcfss.in అనే వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయం, లేదా 9848864449, 9440822219 నెంబర్లను సంప్రదించాలన్నారు.
విధుల నుంచి సమగ్ర శిక్ష ఏపీసీ రిలీవ్
కర్నూలు(సిటీ): సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్గా పనిచేస్తున్న టి.శ్రీనివాసులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఓఎస్డీగా నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం ఎస్ఎస్ఏ అదనపు కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఆయన ఈ ఏడాది జనవరి 4వ తేదీన ఏపీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన సమగ్ర శిక్ష పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో లోటుపాట్లను సరిచేసుకునేందుకు 12 మంది స్పెషల్ ఆఫీసర్లకు నోటీసులు ఇచ్చి కొంత మేరకు మార్పులు తీసుకొచ్చారు. ఏపీసీగా విధుల్లో నుంచి రిలీవ్ అయ్యేందుకు ముందుగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు.
రేపు బీచ్ కబడ్డీ జట్ల
ఎంపిక పోటీలు
నంద్యాల(న్యూటౌన్): ఉమ్మడి కర్నూలు జిల్లా సీనియర్ బీచ్ కబడ్డీ పురుషుల, మహిళల జట్ల ఎంపిక పోటీలు ఈనెల 28వ తేదీన నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ఏపీరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నంద్యాలలోని నందమూరినగర్ నాగులకట్ట వద్ద పోటీలు ఉంటాయని ఆయన తెలిపారు. పురుషులు 85 కేజీల్లోపు, మహిళలు 75 కేజీల్లోపు ఉండాలని, పోటీలకు వచ్చే సమయంలో ఆధార్కార్డు, పదో తరగతి మార్కులిస్టు తీసుకుని రావాలన్నారు. జట్లకు ఎంపికై న వారు మే 2 నుంచి 4వ తేదీ వరకు కాకినాడ బీచ్లో జరిగే రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
బెలుం గుహలకు వేసవి ఎఫెక్ట్
కొలిమిగుండ్ల: బెలుం గుహలపై వేసవి ప్రభా వం పడింది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. సాధారణ రోజుల్లో రోజుకు రూ.15వేలకు పైగా, శని, ఆదివారాల్లో రూ.30 వేల మేర ఆదాయం వస్తుండేది. ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా యాత్రికుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఆదాయం పడిపోయింది.

పోలీసు శాఖలో 154 మందికి స్థానచలనం