ఇప్పుడు విజయవాడలో సగం మందికిపైగా నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారిలో వస్తున్న అనారోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమనే విషయాన్ని గుర్తించలేక పోతున్నారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. ఇప్పుడు స్లీప్ ఆప్నియా ప్రధాన సమస్యగా మారింది. అశ్రద్ధ చేస్తే ప్రాణాంతకంగా మారవచ్చు. అలాంటి వారికి స్లీప్ స్టడీ అందుబాటులోకి వచ్చింది.ఈ టెస్ట్ ద్వారా వారి సమస్యను గుర్తించి తగిన చికిత్స పొందవచ్చు. అర్ధరాత్రి దాటే వరకూ నిద్రపోకుండా ఉండటం కూడా మంచిది కాదు.
–డాక్టర్ మొవ్వ పద్మ, క్రిటికల్ కేర్ నిపుణులు, విజయవాడ


