టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ
మచిలీపట్నంటౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2026వ సంవత్సర టేబుల్ క్యాలెండర్ను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ఆవిష్కరించారు. మంత్రి రవీంద్ర మాట్లా డుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ఉద్యోగులందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఆకాంక్షించారు. మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పి.రాము, జిల్లా కార్యదర్శి తోట వరప్రసాద్, కోశాధికారి బి.సురేష్, నాయకులు పవన్, సలీం, శ్రీనివాసరావు, సముద్రేశ్వరరావు, ఎస్.వి.వి.రామారావు, కోటేశ్వరరావు, కె.లోకేష్, ప్రవీణ్, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, హుస్సేన్, పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా పౌరసరఫరా అధికారి(డీఎస్ఓ)గా ఏడా దిన్నరగా విధులు నిర్వర్తించి, ఉద్యోగ విరమణ చేసిన ఎ.పాపారావును జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సత్కరించారు. విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో పాపారావు సన్మాన కార్యక్రమం బుధవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పౌర సరఫరాల డీఎం టి.వి.సతీష్, పలువురు జిల్లా అధికారులు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
టేబుల్ క్యాలెండర్ ఆవిష్కరణ


