ఆసిఫాబాద్: ఎస్ఐఆర్లో భాగంగా నిర్వహించే హియరింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో మంగళవారం అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్వో వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ నోటీసుల జారీ, హియరింగ్ ప్రక్రియకు సంబంధిత ఓటర్లు హాజరై ధ్రువపత్రాలు సమర్పించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలన్నారు. బూత్ స్థాయి ఏజెంట్లను భాగస్వాములు చేయాలని సూచించారు.


