ఆసిఫాబాద్రూరల్: పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట మంగళవారం ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపా రు. టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశా రు. ఉద్యోగ విరమణ అనంతరం సామాజిక భద్రతతో గౌరవప్రదమైన జీవితం గడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమర్ హుస్సేన్, నా యకులు కుమార్, భిక్షపతి, సంపత్, గురువయ్య, శ్రీనివాస్, కర్ణగౌడ్, సిరాజుల్ హక్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


