అటవీ ఉత్పత్తుల ధర పెరిగేనా? | - | Sakshi
Sakshi News home page

అటవీ ఉత్పత్తుల ధర పెరిగేనా?

Jul 12 2026 12:11 AM | Updated on Jul 12 2026 12:11 AM

అటవీ ఉత్పత్తుల ప్రస్తుత,

ప్రతిపాదనల ధరలు (కేజీకి రూ.ల్లో)

పాల్వంచరూరల్‌: రెండేళ్లుగా కలపయేతర అటవీ ఉత్పత్తులకు ఆశించిన ధరలు లేకపోవడంతో గిరిజ నులు సేకరణపై ఆసక్తి చూపడంలేదు. దీంతో అటవీ ఉత్పత్తుల సేకరణ తగ్గుముఖం పట్టింది. ఈ క్రమంలో పది రకాల అటవీ ఉత్పత్తుల ధరలు పెంచాలని జీసీసీ ప్రతిపాదనలు పంపింది. ధరలు పెరిగితే గిరిజనుల కష్టానికి ఫలితం దక్కే అవకాశం ఉంది. జిల్లాలో కలపయేతర అట వీ ఉత్పత్తుల సేకరణపై వందల మంది గిరిజనులు ఆధారపడి ఉన్నారు. అటవీ ఉత్పత్తులను సేకరించి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేల్స్‌ డిపోల్లో విక్రయిస్తూ, కుటుంబాలను పోషించుకుంటున్నారు. కాగా, పలు ఉత్పత్తులకు ప్రతిపాదనలు పంపగా, తేనె, మారేడు గడ్డలు, అడవి చీపుర్లు, బంక తదితర ఉత్పత్తులకు ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. అధికారులు స్పందించి అన్ని ఉత్పత్తులకు ప్రతి పాదనలు పంపాలని గిరిజనులు కోరుతున్నారు.

అటవీ ఉత్పత్తి ప్రస్తుత ప్రతిపాదిత

ధర ధర

ఇప్పబద్ద 29 50

ఇప్పపువ్వు 30 70

ముష్టిగింజలు 75 130

కుంకుడుకాయలు 40 80

చింతపండు 40 120

నరమామిడిచెక్క 32 60

కానుగ గింజలు 10 40

చిల్లిగింజలు 35 60

గచ్చకాయలు 40 70

కరక్కాయలు 15 40

10 రకాల ఉత్పత్తుల రేటు పెంపునకు

జీసీసీ ప్రతిపాదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement