జమలాపురంలో శాంతి కల్యాణం | - | Sakshi
Sakshi News home page

జమలాపురంలో శాంతి కల్యాణం

Jul 5 2026 2:48 AM | Updated on Jul 5 2026 2:48 AM

ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీవారి మహా కుంభాభిషేకం స్వర్ణోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శనివారం స్వామి, అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్ల శాంతి కల్యాణం నిర్వహించారు. సర్పంచ్‌ తుళ్లూరి నిర్మలకుమారి – కోటేశ్వరరావు దంపతులు కల్యాణం నిర్వహించగా, శివపార్వతుల స్వరూపాలుగా భావిస్తూ లోక కల్యాణార్ధమై గోమాత – వృషభ కల్యాణాన్ని సొసైటీ చైర్మన్‌ ముల్పూరి శ్రీనివాసరావు – స్వప్న దంపతుల చేతుల మీదుగా పూర్తిచేశారు. ఈమేరకు పెద్దసంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటుచేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్‌రావు, చైర్మన్‌ ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement